← Back to news

ప్రశంసాపత్రం అందుకున్న కొన్ని గంటల్లోనే విషాదం

By dk· 16 Aug 2026· జోగులాంబగద్వాల జిల్లా
ప్రశంసాపత్రం అందుకున్న కొన్ని గంటల్లోనే విషాదం

TG: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రతిభా ప్రశంసాపత్రం అందుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) జాంగిర్ పాషా.. కొన్ని గంటల్లోనే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జోగులాంబగద్వాల జిల్లాలో గత ఐదేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న జాంగిర్ పాషాను ఆయన సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ MD రిజ్వాన్ పాషా సత్కరించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో చికిత్స పొందేలోపే కన్నుమూశారు. ఆయన మృతితో 108 సిబ్బంది, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More in Local