వినాయక చవితితో.. ఊరంతా డివోషనల్ వైబ్స్

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని గణేష్ కాలనీలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రజలు పూజలు చేసి వినాయకుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. పూజల తర్వాత యూత్ మెంబర్స్ అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసి, ఊరి ప్రజలకు పండుగ విషెస్ చెప్పారు. ఊరి జనాలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
