← Back to news

ఆత్మహత్యలు వద్దు.. రంగారెడ్డిలో ఎమ్మెల్యే హితబోధ!

By Adithya· 2d ago
ఆత్మహత్యలు వద్దు.. రంగారెడ్డిలో ఎమ్మెల్యే హితబోధ!

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల ఒత్తిడికి గురై ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. బాధగా విద్యార్థులకు హితబోధ చేస్తూ.. ఒత్తిడికి లొంగొద్దని సూచించారు. నచ్చిన రంగాన్ని ఎంచుకుని రాణించాలని పిలుపునిచ్చారు. ఆశలు నెరవేరకపోతే ఆత్మహత్య సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరిత, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, చైర్మన్ అగ్గునూరు విశ్వం పాల్గొన్నారు

More in Local