వినాయక మండపాలకు సీసీ కెమెరాలు తప్పనిసరి..!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో వినాయక చవితి ఏర్పాట్లపై SI టి. మల్లేశ్వరరావు కీలక సూచనలు ఇచ్చారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టాలి. ప్రతి మండపం వద్ద ఇద్దరు నిర్వాహకులు నిరంతరం ఉండాలి. రాత్రివేళ కాపలా ఉండాలని ఆయన చెప్పారు. విద్యుత్ దీపాల ఏర్పాటులో జాగ్రత్తలు పాటించాలి. రాత్రి 10 తర్వాత మైక్ ఆపేయాలి. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని సూచించారు.
