ప్రైవేటీకరణ.. సింగరేణి క్లారిటీ!

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవమని యాజమాన్యం స్పష్టం చేసింది. ’’ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు. 21 భూగర్భ గనులు, 17 ఓపెన్కాస్ట్ గనుల ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా 5 రాష్ట్రాలకు కోల్ సరఫరా చేస్తుంది. కొన్ని గనులు నష్టాల్లో ఉన్నా.. ఉద్యోగ భద్రత కోసం వాటిని కొనసాగిస్తున్నామ’’ని తెలిపింది. శాంతిఖని ఈఓఐ ఆధారంగా ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది. శాంతిఖని ఈఓఐకి స్పందన రాని సంగతి తెలిసిందే.



