← Back to news

ఎక్స్‌ప్రెస్‌వేపై ఆక్సిడెంట్.. గాల్లో ఎగిరిన టెంపో వెహికల్!

By Mahesh· 7 Aug 2026· Maharashtra

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ఆక్సిడెంట్ జరిగింది. మిస్సింగ్‌ లింక్‌ దగ్గర స్పీడ్‌గా వచ్చిన కారు టెంపోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఆక్సిడెంట్‌లో ఒకరు చనిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఢీకొన్న వేగానికి టెంపో గాల్లోకి ఎగిరి బోల్తా పడగా, కారు నుజ్జునుజ్జయింది. ఆక్సిడెంట్ విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగలేదని పోలీసులు తెలిపారు.

More in News