ఎమ్మెల్యే గారూ.. మాకో బడి కావాలి..!

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సంచార జాతుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకోవాలని, చదువుకోవాలంటే బడి కావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ’’బడులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది పిల్లలు చదువు మానేశారు. కొంతమంది మాత్రమే దూర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాల’’ని వారు కోరారు. MLA స్పందించి, ఆ ప్రాంతంలో ఉన్స స్థలంలో పాఠశాల భవనం నిర్మిస్తానని, పిల్లలకు చదువు అందుబాటులోకి తెస్తానని చెప్పారు.



