బుధవారం పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు

బుధవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో జరగబోయే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టిసి బస్సులు కేటాయించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం డిపో పరిధిలోని 25 సాధారణ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప , తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణికులు, ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాటు చేసుకుని, ఆర్టీసీకి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.



