సీటు కోసం RTC బస్సులో రచ్చ .. చివరికి PSకు!

TG: రాష్ట్రంలో ఫ్రీబస్ స్కీమ్తో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న RTC బస్సులో సీట్ విషయమై ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడు వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగాడు. మహిళపై దాడిచేసి, ఆమె బ్యాగ్ను చింపివేయడంతో బస్సులో టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైవర్ బస్సును నేరుగా నర్సాపూర్ PSకు తీసుకెళ్లారు. పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.



