జనం ఫైర్ అవుతున్నారు..ఎందుకు ?
నారాయణఖేడ్ మనూరు మండలం కమలాపూర్లో హరితహారం కింద ఎంతో కష్టపడి పెంచిన 20 చెట్లను నరికేయడంతో గ్రామస్తులు సీరియస్ అయ్యారు. కాంట్రాక్ట్ పనుల పేరుతో ఈ చెట్లను నరకడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు లేక పర్యావరణం దెబ్బతింటుంటే ఇలా చెట్లను కొట్టేయడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై ఆఫీసర్లు వెంటనే ఎంక్వైరీ చేసి, రెస్పాన్సిబుల్ పర్సన్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
