1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ.. పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి మొదలైన ఈ ర్యాలీ.. 420 అడుగుల ఫ్లెక్సీతో కృష్ణవేణి చౌక్ వరకు సాగింది. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ధర్నా చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాల పూత అని నిరసన తెలిపారు.



