కారులో గంజాయి.. భద్రాద్రిలో కేసు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయి సీజ్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో అశ్వాపురం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒడిశా నుంచి షిర్డీకి కారులో 40.56 కిలోల గంజాయి తరలిస్తున్నారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ గంజాయిని గొల్లగూడెం కెనాల్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిస్సాకు చెందిన దంపతులు అరబిందో బిశ్వాస్, సుప్రియలను అరెస్ట్ చేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి నెట్వర్క్పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.



