ప్రజావాణిలో 64 దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

నాగర్కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రజల నుంచి 64 ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



