← Back to news

పల్లె సమస్యలే ఎజెండా.. అభివృద్ధే లక్ష్యం!

By rajinikanth nagilla· 4d ago· Gatlanarsingapur, Bheemadevarpalli, Hanumakonda
పల్లె సమస్యలే ఎజెండా.. అభివృద్ధే లక్ష్యం!

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్ల నర్సింగాపూర్, బొల్లోనిపల్లి గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి, పలువురు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

More in Local