అంజనగిరిలో డ్రై రన్కు రెడీ..! కలెక్టర్ ఆదేశాలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, అంజనగిరి రిజర్వాయర్లో మిషన్ భగీరథ పంప్హౌస్ పనులు వేగంగా సాగుతున్నాయి. మంగళవారం కలెక్టర్ హేమంత, కేశవ్ పాటిల్ ఆ పనులను పరిశీలించి, ఈ నెల 7న జరిగే డ్రై రన్ కు సిద్ధం కావాలని ఆదేశించారు. అన్ని సాంకేతిక, విద్యుత్ పనులను పూర్తి చేయాలని అధికారులకు డైరెక్ట్ ఇచ్చారు. 6 పంపుల్లో 4 పనులు తుది దశకు వచ్చాయని అధికారులు నివేదించారు. డ్రై రన్ అయ్యాక వెట్ రన్ కు కూడా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పనులు పూర్తయితే నీటి సమస్య తీరుతుందని స్థానికుల ఆశ.



