← Back to news

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.కేంద్రం

By DS· 23 Apr 2026· visakhapatnam
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ, సామాన్యులపై ఇంధన భారాన్ని మోపే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 'పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు' అని అధికారికంగా వెల్లడించింది.

More in Local