వినాయకుడికి ఏ నైవేద్యం ఇష్టం?

వినాయక చవితి రోజు సందర్భంగా గణపయ్యకు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మోదకాలు, ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూలు, పరమాన్నం ప్రధాన నైవేద్యాలుగా ఉంటాయి. శనగలతో పాటు అరటి, సీతాఫలం, మామిడి, నేరేడు, చెరకు, కొబ్బరి వంటి పండ్లను కూడా సమర్పిస్తారు. ప్రాంతాలను బట్టి నైవేద్యాల్లో స్వల్ప మార్పులు ఉన్నా మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డూలు, పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది.
