← Back to news

దళితవాడల సమస్యల పరిష్కారానికి ప్రచార యాత్ర

By Rajaratnam· 21 Aug 2026
దళితవాడల సమస్యల పరిష్కారానికి ప్రచార యాత్ర

AP: దళితవాడల్లో నెలకొన్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసా య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రారంభమైన యాత్ర దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, పెనుమూలి, దుగ్గిరాల గ్రామాల్లో కొనసాగింది. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ.మాలాద్రి, వై.నేతాజీ, ఈమని అప్పారావు, జెట్టి బాలరాజు, బూరుగ వెంకటేశ్వర్లు, జె.నవీన్ ప్రకాష్, ఏ.కమలాకర్ తదితరులు పాల్గొన్నా రు.

More in Local