నూతన కల్యాణ మండపం ప్రారంభం

విజయనగరం జిల్లా రాజాంలోని వాసవి కన్యకాపరమేశ్వరి కళింగ వైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొత్త కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ , రాజాం టౌన్ పార్టీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, సభ్యులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



