← Back to news

చిరుతల దాడిలో 7 జంకులు మృతి.. గ్రామస్థుల ఆందోళన!

By Jagadish· 18h ago
చిరుతల దాడిలో 7 జంకులు మృతి.. గ్రామస్థుల ఆందోళన!

అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం టాటిచెర్లలో చిరుతల దాడి చోటుచేసుకుంది. రైతు నరసింహారెడ్డి తన టమాటా పంటకు ఫెన్సింగ్ వేశారు. జంకులు టమాటాలు మేయడానికి వచ్చాయి. వాటిని వెంటాడుతూ రెండు చిరుతలు వచ్చాయి. కంచె ఉండటంతో జంకులు తప్పించుకోలేకపోయాయి. చిరుతలు ఏడు జంకులను వేటాడి చంపాయి. రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు శవపరీక్ష నిర్వహించారు. చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. చిరుతలను బంధించి రక్షించాలని కోరుతున్నారు. ఇది రైతులకు పెద్ద నష్టం కదా!

More in Local