కావలిలో మట్టి వినాయకుల పంపిణీ

వినాయక చవితి సందర్భంగా కావలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద తెదేపా జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 5 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంచారు. MLA కావ్య కృష్ణారెడ్డి స్ఫూర్తితో మూడేళ్లుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్లు రమేష్ తెలిపారు. ఎన్విరాన్మెంట్ను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు బదులు మట్టి గణపతులనే పూజించాలని కోరారు. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.
