జనసేన నాయకుడి మృతిపై విచారణ జరపాలి
పొన్నెకల్లుకు చెందిన జనసేన గ్రామ ప్రధాన కార్యదర్శి చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అశోక్బాబు డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్రెస్క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. పోలీస్ కస్టడీలో హింసించడం వల్లే గోపి చనిపోయాడని ఆరోపించారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు గవర్నమెంట్ ఫైనాన్షియల్గా అండగా నిలవాలని, లేదంటే స్టేట్ వైడ్గా ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
