మహమ్మద్ ఖదీర్బాబుకు బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారం

బెంగళూరులో మూడు రోజులపాటు నిర్వహించిన బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్లో ఈ ఏడాది బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ తెలుగు రచయిత, జర్నలిస్టు మహమ్మద్ ఖదీర్బాబు అందుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఖదీర్బాబు కథా రచయిత, సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు. ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మబండ కతలు’, ‘న్యూ బాంబే టైలర్స్’, ‘బియాండ్ కాఫీ’, ‘మెట్రో కథలు’, ‘దాహగీతి’ కథా సంకలనాలు వెలువరించారు. ‘రైటర్స్ మీట్’ స్థాపించి యువ రచయితలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.



