పార్కు నిర్మాణానికి శ్రీకారం

AP: తాడేపల్లి మండలం రాధారంగనగర్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి పార్కు కీలకంగా మారనుంది. ఆంజనేయస్వామి విగ్రహం పక్కన ఉన్న స్థలంలో రూ.83 లక్షలతో చేపట్టనున్న పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పనులకు శ్రీకారం చుట్టారు.



