కోడి పందేలపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామ శివారులో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. టాస్క్ఫోర్స్, కన్నెపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. కోడి పందేలు, బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ.2,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఈ దాడి జరిగింది. జూదం, బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
