← Back to news

మహాధర్నాకు కదిలిన సూర్యాపేట ఉపాధ్యాయులు

By Ramakrishna Ameraboina· 3d ago

TG: సూర్యాపేట జిల్లా నుంచి పీఆర్‌టీయూ-టీఎస్‌ ఉపాధ్యాయులు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్‌ నివేదికను వెంటనే తెప్పించి మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ-టీఎస్‌ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

More in Local