ORC భూములకు పట్టాలు ఇవ్వాలని వినతి

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో జారీ చేసిన ORCలకు నాలుగేళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని సీపీఐ(ఎం) గ్రామ కమిటీ ఆరోపించింది. రైతులు రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసి, ORCల ఆధారంగా అర్హులైన భూలబ్ధిదారులకు తక్షణమే పట్టాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి పి.శివశంకర్, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.



