అంగన్వాడీల్లో ఫేక్ తనిఖీలు.. ముగ్గురు అరెస్ట్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 'ఇప్సోస్' కంపెనీ పేరిట ఫేక్ తనిఖీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీ సెంటర్కు వెళ్లి తమను ఆఫీసర్లుగా పరిచయం చేసుకుని, సిబ్బందిని బెదిరించి రూ.3,000 డిమాండ్ చేశారు. భయపడిన టీచర్ రూ.1,000 ఇవ్వగా, ఈ విషయాన్ని ఆమె వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడంతో అలర్ట్ అయిన మిగతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.



