క్రైస్తవుల హక్కుల కోసం ఉద్యమించాలి.. MBC చైర్మన్

TG: క్రైస్తవుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా ఉద్యమించాలని MBC చైర్మన్ పాస్టర్ వరప్రసాద్ పిలుపునిచ్చారు. క్రైస్తవులకు పూర్తి స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కుల సాధన సమితి పట్టణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మానియేల్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ను హైదరాబాద్లో MBC చర్చిలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ.. క్రైస్తవులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే కాకుండా వివక్షకు గురిచేయడం బాధాకరమన్నారు.

