అక్రమ మట్టి తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు

గూడూరు మండలం పోటుపాలెం, చిల్లకూరు మండలం నాంచారమ్మపేట సరిహద్దుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తుండగా పోలీసులు జేసీబీ, లారీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తవ్వకాలతో భూమి స్వరూపం దెబ్బతినడంతోపాటు పర్యావరణం, వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలను గూడూరు పోలీసు స్టేషన్కు తరలించారు.



