← Back to news

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

By Mulnivasi· 2d ago
ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

ముంబైలోని తెలంగాణ వలస కార్మికుల కోసం ఓ డిమాండ్ వినిపిస్తోంది. బుధవారం ధోబీఘాట్‌లోని సంత్ గాడ్గేబాబా విగ్రహం వద్ద ఉద్యమ నేత బట్టు శ్రీధర్ గంగపుత్ర, రాజు మాదిగ మాట్లాడారు. ’’ముంబైకర్లు రెండు రాష్ట్రాల మధ్య నాన్-లోకల్‌గా మిగిలిపోతున్నారు. ఇది బాధాకరమ‘‘ని శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కె.కె. కమిటీ ప్రతిపాదించిన సౌకర్యాలు ముంబై ఉద్యమకారులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రజక సమాజం, ఎంటిజెఏసి నేతలు కల్లూరి సురేష్, తడ్కపల్లి నరేష్, సిద్దిరాములు, ఎస్.రాజు, భూమేష్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

ముంబైకర్లను.. తెలంగాణ స్థానికులుగా గుర్తించాలి!

More in Local