← Back to news

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

By Ramprasad· 4d ago
అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

కరప మండలంలోని నడకుదురు గ్రామంలో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని, అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని తెలిపారు. ​గత 35 రోజులుగా పర్యటిస్తున్న సమయంలో గ్రామాల్లో అనేకమంది పింఛన్లు అందడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

More in Local