జిల్లాలో 5,774 కేసులు పరిష్కారం

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెంలో అత్యధికంగా 3,384 కేసులు, భద్రాచలంలో 1,121, ఇల్లందులో 602, మణుగూరులో 422, దమ్మపేటలో 245 కేసులు పరిష్కరించారు. కొత్తగూడెంలో 8 మోటార్ వాహన ప్రమాద కేసులను రూ.37.50 లక్షలకు పరిష్కరించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు, పీఎల్సీ, సైబర్ క్రైమ్, టెలిఫోన్, ట్రాఫిక్ చలాన్ కేసులను పరిష్కరించారు. పరస్పర అంగీకారంతో కేసులు త్వరగా పరిష్కారం కావడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు.
