అమ్మవారి ఆలయ పరిసరాల్లో డీజేలపై నిషేధం

పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలలో డీజే సౌండ్ సిస్టలను నిషేధించినట్లు ఆలయ ఈవో లీలా కుమార్ శనివారం తెలిపారు. కొంతమంది వ్యక్తులు ప్రతి కార్యక్రమానికి ఆలయ పరిసరాల్లో డీజే పాటలు పెడుతున్నారన్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆలయ పరిసరాలలో డీజేలు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అయితే దీనిపై కొందరు సంతృప్తిని వ్యక్త పరచగా, కొందరు దీనిని పునరాలోచించాలని ఈ. ఓ. ని కోరుతున్నారు.



