బూర్గుల రామకృష్ణారావు సేవలు మరవలేనివి : MLA

రంగారెడ్డి జిల్లాలో బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా షాద్నగర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 1952లో షాద్నగర్ నుండి గెలిచి హైదరాబాద్ రాష్ట్ర CM అయిన బూర్గుల, రెవెన్యూ, ఎడ్యుకేషన్ సెక్టార్లలో తెచ్చిన సంస్కరణలు గ్రేట్ అని కొనియాడారు. వినోబాభావే భూదానోద్యమానికి ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చి, పేదలకు భూమి దక్కడంలో కీలక పాత్ర పోషించారని MLA గుర్తుచేసుకున్నారు.

