← Back to news

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు

By bhaskararao· 2d ago
ఘోర రోడ్డు ప్రమాదం  ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం, ధనపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. బూరగాం పంచాయతీ కార్యదర్శి ఉదయశ్రీ, రొంపివలస కార్యదర్శి ప్రసన్న ఇందులో గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే స్పందించి, క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ శ్రీకాకుళం తరలించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం  ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు

More in Local