← Back to news

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ధర్నా

By Srinivas· 2d ago
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ ధర్నా

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

More in Local