ల్యాబ్ టెక్నీషియన్ లేక తలుపులకు నోటీసు

TG: వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్షల విభాగం వద్ద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గది నంబర్ 103లో ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం పరీక్షలు నిర్వహించడంలేదని తెలుపుతూ తలుపులకు నోటీసు అంటించారు. దీంతో తెల్లవారుజామునే దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన రోగులు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరీక్షలు అవసరమైన సమయంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు ప్రశ్నించారు.



