గోదావరిఖానిలో పశువుల భీతి! ప్రాణాలు పోతున్నాయ్

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖానిలో రోడ్లపై పశువుల సంచారం భయంగా మారింది. రాత్రిళ్లు పశువుల సంచారం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. 5in cline కాలనీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. గతంలో ఇలాంటి ప్రమాదాల్లో చాలామంది మరణించారు. అయినా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదు. "వెంటనే పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి" అని స్థానికులు అంటున్నారు.. మీ పరిసరాల్లో కూడా ఇలాంటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.




