కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ధర్నా
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ ఇన్చార్జ్ బుక్య జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు.




