‘CPS వద్దు.. OPS ముద్దు’.. HYD లో ఉపాధ్యాయుల ధర్నా

HYD లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు PRTUTS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ‘CPS వద్దు.. OPS ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని MLC శ్రీపాల్ రెడ్డి కోరారు.



