విపత్తులపై విద్యార్థులకు అవగాహన

AP: విద్యార్థుల్లో విపత్తులపై అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (CARDS) స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని నగరం, బాపట్ల, కొల్లూరు, వేమూరు, కొల్లిపర మండలాల్లో 30 ఉన్నత పాఠశాలల్లో ‘చైల్డ్ లెడ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్’ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కొల్లిపర మండలం వల్లభాపురం పాఠశాలలో 36 మంది విద్యార్థులకు విపత్తుల రకాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర నంబర్లపై PPT ద్వారా అవగాహన కల్పించారు.





