సత్వరం సమస్యలు పరిష్కరించాలి

CPM మదనపురం మండల కమిటీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం స్థానిక సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో రేపోల రాజుకు వినతిపత్రం అందించారు. మండల కార్యదర్శి వెంకట్ రాములు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి మండలంలో విద్య, వైద్యం స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించామన్నారు. సత్వరం సమస్యలు పరిష్కరించాలని కోరారు.



