ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీడ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మరణించారు. 80శాతానికి పైగా గాయాలతో హైదరాబాద్ అపోలో DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఉండడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో పని చేస్తున్న శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినా ఫలితం లేకుండా పోయింది.

