← Back to news

నిధులు మంజూరు చేయాలని వినతి

By Srikanth Ambeeri· 3d ago
నిధులు మంజూరు చేయాలని వినతి

TG: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పాలకవర్గం మంత్రి శ్రీధర్‌బాబును కోరింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రిని హుజురాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుహాసిని, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

More in Local