యూరియా యాప్ పై అవగాహన లేక రైతుల అవస్థలు

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గ్రామాల్లో యూరియా ఎరువు కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అధికారులు వ్యవసాయ గ్రూపుల్లో యూరియా యాప్పై సమాచారం, సూచనలు పంపుతున్నప్పటికీ, రైతులకు యాప్పై పూర్తి అవగాహన లేకపోవడంతో యూరియా పొందడంలో అయోమయం నెలకొంది. పంట సీజన్ మధ్య దశకు చేరుకున్నా సమస్యలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. యూరియా వినియోగం, యాప్ నమోదు, సరఫరా విధానంపై గ్రామస్థాయిలో రైతులకు ప్రత్యక్షంగా వివరించడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రైతులు వ్యవసాయ అధికారులను కోరుతున్నారు.



