← Back to news

పంటపొలాల్లో మొసలి పిల్లలు కలకలం

By DK· 8 Jun 2026· Dishadaily· సంగారెడ్డి జిల్లా
పంటపొలాల్లో మొసలి పిల్లలు కలకలం

TG : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మిలిగిరిపేట గ్రామశివారులో మొసలి పిల్లలు కనిపించడం కలకలం రేపింది. పశువులను మేపుతున్న కాపరులకు సుమారు 20కిపైగా మొసలి పిల్లలు కనిపించడంతో కంగుతిన్నారు. గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మిలిగిరిపేట ప్రాజెక్టు పరిధిలోని వాగు సమీపంలో సుమారు 60కు పైగా మొసలి గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు మొసలి పిల్లలు, గుడ్లను సురక్షితంగా సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామంలోని అభయారణ్యానికి తరలించారు.

More in Local