మహాధర్నాకు బయలుదేరిన ఉద్యోగులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పీఆర్టీయూ నాయకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. నర్సంపేట నుంచి పీఆర్టీయూ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆందోళనలో పాల్గొననున్నారు.



