గిరిజనుల హామీలపై కాంగ్రెస్ను ప్రశ్నించిన మాజీ MLA

గిరిజన కార్పొరేషన్లకు 500 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రామిస్ ఏమైందని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మాజీ MLA వై.అంజయ్య యాదవ్ ఫైర్ అయ్యారు. క్యాంప్ ఆఫీస్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, BRS హయాంలో 10శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్పెషల్ పంచాయతీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక గిరిజనులకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నేతలు నారాయణరెడ్డి, రాంబల్ నాయక్ పాల్గొన్నారు.



