సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ పోరుబాట

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా అసమర్థ పాలన సాగిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారంరోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు.



